మా ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతి

by  |

దిశ‌, ఖ‌మ్మం: కేసీఆర్ ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మంత్రి అజ‌య్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం యాతలకుంట్ల, రేగళ్ల‌పాడు, బుగ్గపాడు గ్రామాల్లో జ‌రుగుతున్న చెరువు పూడికతీత‌ పనుల్లో పాల్గొన్న ఉపాధి హామీ కూలీలకు శ‌నివారం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ కూరగాయలు, బత్తాయి కాయలు, మాస్కులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల‌ను పంపిణీ చేశారు. వీరితోపాటు క‌లెక్ట‌ర్ కర్ణ‌న్, అదనపు కలెక్టర్ స్నేహలత కూడా పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed