మంత్రి అజయ్ కుమార్ రక్తదానం

by  |
మంత్రి అజయ్ కుమార్ రక్తదానం
X

దిశ‌, ఖ‌మ్మం: రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌ కుమార్ తన పుట్టిన‌రోజును పురస్కరించుకుని ఆదివారం మ‌మ‌త ఆస్ప‌త్రిలో ర‌క్తదానం చేశారు. అనంతరం మమత వైద్య క‌ళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కరోనా ఆకార కేక్‌ను క‌ట్ చేశారు. ఈ వైరస్ వ్యాప్తి తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అంత‌కుముందు ఉద‌యం ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. అజ‌య్‌ కుమార్‌కు ట్విట్ట‌ర్ ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘‘ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలతో ఉంటూ ఎక్కవ కాలం ప్రజా జీవితంలో గడపాలని కోరుకుంటున్నా అన్న’’ అని ట్వీట్ చేశారు.

Tags: minister ajay kumar, birth day, ktr tweet


Next Story

Most Viewed