సుప్రీంకోర్టు అక్షింతలపై ఏపీ విద్యాశాఖ మంత్రి రియాక్షన్

by  |
సుప్రీంకోర్టు అక్షింతలపై ఏపీ విద్యాశాఖ మంత్రి రియాక్షన్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించినట్లు తెలిపిన ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వివరించనున్నట్లు తెలిపారు.

ఇంటర్ పరీక్షల మార్కులు ఎంసెట్‌కు ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటామనే విషయాన్ని కూడా వివరించామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించినా అమలు చేస్తామన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed