- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రారంభం నుంచి పని చేస్తున్న కీలక నేత టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్ సామ వెంకట్రెడ్డి గులాబీని వీడి కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ను టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో పాటు కలిశారు.
ఈ సందర్భంగా సామ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు. 33 జిల్లాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి కమిటీలు ఉన్నాయని, అందరినీ సంప్రదిస్తానని సామ వెంకట్రెడ్డి ప్రకటించారు.
Next Story