పూజారికి కరోనా.. స్పందించిన ఓవైసీ

by  |
పూజారికి కరోనా.. స్పందించిన ఓవైసీ
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా బారినపడి ఆలయ పూజారి పట్ల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పాతబస్తీలోని ఓ ఆలయ పూజరి కరోనాబారిన పడ్డాడు. అయితే అతను కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో నిన్న పూజారి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. కానీ అక్కడ బెడ్లు దొరకకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానిక మజ్లిస్ నేత సాయంతో అసదుద్దీన్ను కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఆయన శాలిబండలోని ఓ ప్రైవేటు యాజమాన్యంతో మాట్లాడి పూజారికి బెడ్ ఇప్పించారు.

Next Story

Most Viewed