‘కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చు’

by  |
‘కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చు’
X

దిశ, కరీంనగర్: రాష్ట్రంలో ఈసారి కోటి మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడి అయ్యే అవకాశాలు ఉన్నాయని ర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఈసారి ధాన్యం దిగుబడి చాలా పెరగనుందని అంచనా వేస్తున్నామని గత సీజన్ కంటే ఈసారి రెట్టింపు దిగుబడి రానుందన్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా అమలు పర్చాలని శానిటైజేషన్, మాస్కులు కూడా రైతులు ధరించాలని మంత్రి కోరారు.

tags;Crop purchase center,1 crore metric tons Grains,Minister kamalakar rao



Next Story

Most Viewed