ఈ నెల 20నుంచి పాల కొనుగోలు

by  |
ఈ నెల 20నుంచి పాల కొనుగోలు
X

దిశ, వెబ్‎డెస్క్ : ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల కొనుగోలు ప్రారంభం అవుతుందని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి అమూల్ మిల్క్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరుగుతోందన్నారు. ప్రస్తుతం రోజుకు 70 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని.. మిగిలిన 200 లక్షల లీటర్ల పాలను సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఏపీ-అమూల్ ఒప్పందంలో హెరిటేజ్‎ను టార్గెట్ చేసిందేమి లేదన్నారు. పాడి రైతుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అప్పలరాజు చెప్పుకొచ్చారు.

Next Story