- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి భారతజాతిని గర్వంగా తలెత్తుకునేలా చేశాడు అథ్లెట్ నీరజ్ చోప్రా. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తనపై ప్రశంసల వర్షం కురిపించగా.. రివార్డులు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ ఆయన ట్రెండింగ్లోకి వచ్చాడు. ఈ క్రమంలో నీరజ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే అంశం తెరమీదకు వచ్చింది. తనకు కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మిలప్ జవేరి.. నీరజ్ చోప్రా- హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ట్విన్ బ్రదర్స్లా కనిపిస్తున్నారని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా షేర్ చేసిన ఆయన.. బయోపిక్ తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు త్వరగా ప్లాన్ చేయమని సూచిస్తున్నారు. ఈ ఫొటోలో నీరజ్.. ‘మర్ జావా’ సినిమాలో సిద్ధార్థ్ లుక్స్కు దగ్గరగా ఉండగా.. ఫ్యాన్స్ బయోపిక్ టాపిక్ను వైరల్ చేస్తున్నారు.