ములుగు జిల్లాలో వలస కూలీ మృతి

by  |
ములుగు జిల్లాలో వలస కూలీ మృతి
X

దిశ, వాజేడు: ట్రాక్టర్ పైనుండి పడి వలస కూలీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పేరూరు ఎస్సై బండి హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్ల రమేశ్ రైతు, అన్నారం గ్రామానికి చెందిన కూలీలను తన ట్రాక్టర్ లో తన మిర్చిచేనుకు తీసుకురమ్మని దాసరి దేవయ్య డ్రైవరు కి ఇచ్చి పంపాడు. అతను కూలీలను తీసుకొని వస్తున్న క్రమంలో డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో అందులోని కూలీ అయిన యాలం సాగర్ (21) ట్రక్కు టైరు కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అక్క ఫిర్యాదుమేరకు పోలీసులు కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed