కూలిన మిగ్-21 విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి

by  |
mig-21 aircraft crashed
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో మరో విషాదం. ఇండియాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21 విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మరణించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గుప్తా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

కాగా ఈ ఘటనపై వాయుసేన ప్రత్యేక కోర్టు విచారణకు ఆదేశించింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో మూడు మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.


Next Story

Most Viewed