యాదాద్రి జిల్లాలో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఆందోళనలో గ్రామస్తులు

by  |
యాదాద్రి జిల్లాలో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఆందోళనలో గ్రామస్తులు
X

దిశ, గుండాల : యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని తుర్కల షాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఎవరూ లేని ఇళ్లనే టార్గెట్ చేసుకొని పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేశారు. వెల్మినేటి సొంపుల్లయ్య, వృద్ధ మహిళ సురిగల నరసమ్మ, పంజాల సుదర్శన్ ఇల్లలో చోరీకి పాల్పడ్డారు.

ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని గుండాల ఎస్ఐ డి. సందీప్ కుమార్ క్లూస్ టీం ఆధ్వర్యంలో పరిశీలించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని ఈ వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అనుమానితులు ఎవరైనా ఉంటే సమాచారం అందించాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed