- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్: ఇచ్చోడ మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి నగదు, విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం పూజకి వెళ్లిన స్వాములు చూడగా ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఆలయంలోని రూ. లక్షా 20 వేలు విలువ చేసే 3 ఉత్సవమూర్తుల విగ్రహాలు, ఒక గంట, పూజారికి చెందిన రూ. 10 వేల నగదు మరియు హుండీలోని నగదు చోరీ అయినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story