అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి చోరీ.. నగదు, విగ్రహాలు అపహరణ

by  |
Icchoda-1
X

దిశ, బోథ్: ఇచ్చోడ మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి నగదు, విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం పూజకి వెళ్లిన స్వాములు చూడగా ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఆలయంలోని రూ. లక్షా 20 వేలు విలువ చేసే 3 ఉత్సవమూర్తుల విగ్రహాలు, ఒక గంట, పూజారికి చెందిన రూ. 10 వేల నగదు మరియు హుండీలోని నగదు చోరీ అయినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story