మరింత విషమంగా ఎస్పీబీ ఆరోగ్యం

by  |
మరింత విషమంగా ఎస్పీబీ ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమించింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయన ఆరోగ్య పరిస్థితి నిముష నిముషానికి అత్యంత విషమంగా మారుతుందని శుక్రవారం ఉదయం చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు కాసేపట్లో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. దీంతో ఏ సమయంలో ఏ జరుగుతుందో తెలియక బాలు కుమారుడు చరణ్, భార్య సావిత్రి పక్కనే కూర్చున్నారు. అంతేగాకుండా బాలు ఆరోగ్య పరిస్థితిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస్పత్రి సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Next Story

Most Viewed