సరికొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ 'ఆస్టర్' లాంచ్

by  |
సరికొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ ఆస్టర్ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ కంపెనీ తన ఎస్‌యూవీ ‘ఆస్టర్‌’ను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత టెక్నాలజీ ఇందులో ఉపయోగించినట్టు కంపెనీ వెల్లడించింది. రూ. 9.78 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తీసుకొచ్చామని, ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభించే ఈ మోడల్ ధరలు రూ. 9.78 లక్షల నుంచి రూ. 16.78 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న హ్యూండాయ్ క్రెటా, మారుతీ సుజుకి నుంచి బ్రెజా, నెక్సా ఎస్‌క్రాస్ మోడళ్ల వంటి మిడ్-రేంజ్ ఎస్‌యూవీ విభాగంలోని కార్లకు ఆస్టర్ పోటీ ఇవ్వనున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఎంజీ మోటార్ ‘ఆస్టర్’ కోసం అక్టోబర్ 21 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఈ ఏడాది ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 5,000 కార్లను విక్రయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కంపెనీ వివరించింది. అత్యాధునిక సాంకేతికతతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఆస్టర్ మోడల్ కారు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లెవెల్ 2 టెక్నాలజీ ఫీచర్లను ఇందులో అమర్చినట్టు కంపెనీ తెలిపింది. మొత్తంగా ఈ మోడల్‌లో 80 రకాల ఏఐ ఫీచర్లను పొందుపరిచినట్టు కంపెనీ పేర్కొంది. ఇంకా, 6ఎయిర్‌బ్యాగులు, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్, పానరొమిక్ స్కై రూఫ్, 10.1 అంగుళాల హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సహా ఇంకా అనేక అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed