కాంగ్రెస్ ఎంపీల వల్లే అది సాధ్యమైంది : మెట్టు సాయి కుమార్

by  |
Congress leader Mettu Sai Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మత్స్యకార బీమాను పెంచే విధంగా చర్యలు తీసుకున్నారని ఫిషర్మెన్ తెలంగాణ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 3న ఫిషర్మెన్ కాంగ్రెస్ మత్స్యకారుల బీమా విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసిందని చెప్పారు. అనంతరం పార్లమెంట్ సమావేశ సమయంలో ఈ విషయంపై ఎంపీలు రేవంత్, ఉత్తమ్‌లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. కేంద్రం స్పందించి మత్స్యకార బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మత్స్యకార కుటుంబాలు రుణపడి ఉంటాయని తెలిపారు.



Next Story

Most Viewed