మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లకు 'డ్రీమ్‌ఫెస్ట్' ఆఫర్స్

by  |
మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లకు డ్రీమ్‌ఫెస్ట్ ఆఫర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్ ఇండియా’రాబోయే పండుగ సీజన్ కోసం ‘డ్రీమ్‌ఫెస్ట్’ పేరుతో ఫైనాన్సింగ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలను బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్స్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు, ప్రత్యేకంగా 10 ఏళ్ల వ్యవధిలో తక్కువ ఈఎంఐ, అలాగే, పాత కారు నుంచి కొత్త వాటికి మారుతున్న వాహనదారులకు రాయితీలు ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ డ్రీమ్‌ఫెస్ట్ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని, ఇందులో ఎస్-క్లాస్ లిమొసిన్, జీఎల్ఏ, జీఎల్‌సీ, ఈ-క్లాస్‌తో సహా ఎంపిక చేసిన మెర్సిడెస్ బెంజ్ మోడళ్లను కొనుగోళ్లకు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది.

పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా వినియోగదారులు 6.99 శాతంతో ఫైనాన్స్ పొందవచ్చు. అలాగే, ఈజీ 10 పథకం ద్వారా 10 ఏళ్ల కాలవ్యవధితో తీసుకునే వాటికి తక్కువ ఈఎంఐలో అందిస్తుందని, ఇప్పటికే తమ కారు ఉన్న వారు కొత్త మోడల్‌కు మారాలని అనుకుంటే 40 శాతం తక్కువ ఈఎంఐ హామీని ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది. అంతేకాకుండా మెర్సిడెస్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వారికి ఏడు సార్లు ఫార్ములా-1 ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్‌ని కలిసే అవకాశం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, అబుదాబిలో జరిగే గ్రాండ్ ప్రిక్స్‌కు ట్రిప్ ఆఫర్ అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ టెస్ట్ డ్రైవ్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే లక్కీ డ్రాలో గెలుపొందేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed