మేము పని చేయలేం.. మమ్మల్ని వదిలేయండి

by  |
మేము పని చేయలేం.. మమ్మల్ని వదిలేయండి
X

దిశ, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మెప్మా ఆర్.పి(రిసోర్స్ పర్సన్స్)లు కరోనాలో విధులు నిర్వహించమని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్‎కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 11 నెలల నుంచి వేతనాలు రాక పోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ లేకుండా వార్డులలో తిరగడం కష్టంగా ఉందన్నారు. ఈ కారణంగానే మరో నెల రోజుల వరకు విధులు నిర్వహించమని స్పష్టం చేశారు. ఇప్పటికే వేతనాలు లేక కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారిందని.. కరోనా సోకితే తమ పరిస్థితి ఎంటని ప్రశ్నించారు.

Next Story

Most Viewed