రూ.లక్ష రివార్డు ముమ్మాటికీ కక్షసాధింపే

by  |
రూ.లక్ష రివార్డు ముమ్మాటికీ కక్షసాధింపే
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం వైద్యులను వేధింపులకు గురిచేస్తోందని టీడీపీ నేత చిన్నరాజప్ప ఆరోపించారు. డాక్టర్ రమేశ్ కుమార్ ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ప్రకటించడం ముమ్మాటికీ కక్షసాధింపేనని ఆయన మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లను వేధించడం తగదన్నారు. వైద్యులను సర్కార్ తీవ్రవాదులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ, నంద్యాలలోని ఎప్పీవై ఆగ్రో కంపెనీలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానీ, రమేశ్ ఆసుపత్రి ఘటనపై మాత్రం అత్యుత్సాహం చూపుతోందని చిన్నరాజప్ప మండిపడ్డారు.

Next Story