కశ్మీర్ తెరచి ఉంచిన జైలు : ముఫ్తీ

by  |
కశ్మీర్ తెరచి ఉంచిన జైలు : ముఫ్తీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర పాలిత ప్రాంతం కశ్మీర్ గురించి మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ తెరచి ఉంచిన జైలు అని అన్నారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్త పరచడానికి హక్కులు లేవని విమర్శించారు. తనను అక్కడి ప్రభుత్వం మళ్లీ అన్యాయంగా నిర్భంధించినదన్నారు. శ్రీనగర్‌లోని తన ఇంట్లోకి మీడియా వారిని కూడా అనుమతించడం లేదని, తన నిర్భంధం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని’ మండిపడ్డారు.

డీడీసీ ఎన్నికలకు ఇంకా రోజు దూరంలో మాత్రమే ఉన్నామని, కానీ తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలను ఎన్నికల నిర్వహకులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

Next Story

Most Viewed