యాదాద్రి ఆలయ గోపురానికి ‘మేఘా’ విరాళం

by  |
Yadadri
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, కంపెనీలు విరాళాలు ప్రకటించాగా బుధవారం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఆరు కేజీల బంగారం బహుకరించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదమైన అవకాశమని అన్నారు. విరాళానికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా చెక్కు రూపంలో నగదును అందజేస్తామని తెలిపారు.

Next Story