వరద బాధితులకు ‘మేఘా’ కంపెనీ భారీ విరాళం

by  |
వరద బాధితులకు ‘మేఘా’ కంపెనీ భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వరద బాధితుల కోసం ‘మేఘా’ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు సీఎం సహాయ నిధికి రూ.10కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మేఘా సంస్థ ప్రకటించిన భారీ విరాళం పట్ల సీఎంవో హర్షం వ్యక్తం చేసింది. ప్రజలను ఆదుకోవడంలో ముందుండి విరాళం ప్రకటించిన మేఘా యాజమాన్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.


Next Story

Most Viewed