- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినాన మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. సుప్రీం హీరో సాయి ధరమ్తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్ మీద నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45 కేబుల్ బ్రిడ్జి మార్గం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా కోహినూర్ హోటల్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కుడి కన్నుపైన, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్రమాదం షూటింగ్లో భాగంగా జరిగిందా? లేక వేరే కారణంగా జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. సాయికి ప్రమాదం జరిగిన విషయం తెలిసిన మెగా కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.