గాంధీభవన్‌లో సందడి.. వరుస సమావేశాలు

by  |
గాంధీభవన్‌లో సందడి.. వరుస సమావేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్​లో శనివారం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎల్లుండి నిర్వహించే భారత్​ బంద్​, రాష్ట్రంలో నిర్వహించిన దళిత దండోరా సభలపై చర్చించేందుకు ఏఐసీసీ ఇంచార్జ్​ కార్యదర్శులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్​ నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ఈ నెల 27న నిర్వహించే బంద్​పై సమీక్షించారు. ఏఐసీసీ ఇంచార్జ్​ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్​ కృష్ణన్​ ఈ మీటింగ్​లో పాల్గొన్నారు.



Next Story