- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సికింద్రాబాద్: వచ్చే రోగులకు బాత్రూంలు కూడా లేవంటూ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డికి లాలాపేట ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు మొరపెట్టుకున్నారు. తుకారం గేట్ అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్ సీ) ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం హాస్పిటల్ డెవలెప్ మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హాజరైయ్యారు.
ఈ సందర్భంగా అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందికి ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, డ్రెస్సింగ్ రూమ్, బాత్ రూమ్, మంచినీరు, బోర్ వాటర్, వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూమ్స్ లేవని డిప్యూటీ మేయర్ కు తెలిపారు. స్పందించిన శ్రీలత శోభన్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్య రాణి, టీఆర్ఎస్ నాయకులు శైలజ, వనజ లక్ష్మీ, ఎస్ఎల్ఎఫ్ నెంబర్స్, ఎంపీహెచ్ఎస్ లీడర్స్, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.