- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: నర్సింగ్ విద్యార్థులకు వ్యాక్సిన్ కరువైంది. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించాలని డీఎంఈ సలహాలిస్తున్నారు. సూపర్ స్ప్రెడర్స్ కు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లను చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రంలో 161 నర్సింగ్ కళాశాలలుండగా వీటిలో దాదాపుగా 32వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వైద్య విద్యార్థుల పట్ల వైద్యవిద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యాక్సిన్ వేయాల్సిన ఉన్నతాధికారులు సాధారణ ప్రజలతో పాటు వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహాలిస్తున్నారు. శిక్షణల నిమిత్తం విద్యార్థులు ఆసుపత్రుల్లో పేషెంట్లకు సేవలు అందించాల్సి ఉంటుంది.
అయితే విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఆసుపత్రుల్లో శిక్షణలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని డీఎంఈకి వినతి పత్రాలు అందించగా ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది సూపర్ స్ర్పెడర్స్ ను గుర్తించి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లను చిన్న చూపు చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.