కరోనాతో అమరులైన వైద్యులకు నివాళి

by  |
కరోనాతో అమరులైన వైద్యులకు నివాళి
X

దిశ, కోదాడ: కోదాడ మండల పరిధిలోని కాపుగల్లులో కరోనాపై పోరాటంలో అమరులైన వైద్యులు, వైద్య సిబ్బందికి కాపుగల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ… కరోనాపై పోరాటానికి అమరులైన, వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాంద్ చేశారు. అంతేగాకుండా బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, 500 గజాల ఇంటిస్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.


Next Story

Most Viewed