మరి మాస్కులేని ఎమ్మెల్యే సంగతేంది?

by  |
మరి మాస్కులేని ఎమ్మెల్యే సంగతేంది?
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మాస్క్ లేకుండా పశు వైద్యాధికారికి పల్లె ప్రసాద్ హాజరయ్యారు. దీంతో ఆ వైద్యాధికారికి ఎంపీడీఓ రమేష్ రూ.1000 ఫైన్ విధించారు. మాస్క్ లేకుండా సమావేశానికి హాజరు కావడం పట్ల పశువైద్యాధికారిపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు కూడా మాస్కు లేదు. దీంతో అక్కడున్న మిగతావారు పశువైద్యాధికారికి ఫైన్ వేశారు సరే ఎమ్మెల్యేకు ఎందుకు వేయలేదని గుసగుసలాడుకున్నారు.

Next Story