- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ చిప్సెట్ సంస్థ మీడియాటెక్ భారత్లో ఆర్అండ్డీ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు, విస్తరణ ప్రక్రియ కోసం భారీగా నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్నట్టు, దేశీయంగా ఏఐ, స్మార్ట్ హోమ్, 5జీ, వైర్లెస్ కమ్యూనికేషన్ లాంటి వాటి కోసం ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ నియామకాల్లో భాగంగా ఎంతమందిని తీసుకోనున్నదనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ‘మీడియాటెక్ భారత్లో కీలక మార్కెట్ వాటాను కలిగి ఉంది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో ఆవిష్కరణలు రూపొందించేందుకు స్థానికంగా నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవాలని భావిస్తున్నాం. అంతేకాకుండా కేంద్రం తెచ్చిన నినాదం మేక్ ఇన్ ఇండియాకు కట్టుబడి ప్రణాళికలను అమలు చేస్తున్నాం. ప్రస్తుతం భారత్లోని బెంగళూరు, నోయిడాలలో ఉన్న పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనా, ఉత్పత్తి సామర్థ్యాలను పటిష్ఠం చేయడానికి భారీగా నియామకాలు చేపడతామని’ మీడియాటెక్ బెంగళూరు జనరల్ మేనేజర్ రీతుపర్ణ వెల్లడించారు.