డబుల్ బెడ్ రూమ్ బిల్డింగ్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

by  |
suicide attempt
X

దిశ, కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి శ్రీనివాస్ నగర్ కాలనీ, నాగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డబుల్ బెడ్ రూంల పైనుంచి దూకి కె. సత్య సంతోషిణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

తుక్కుగూడా ప్రాంతానికి చెందిన పవన్ భగవాన్ అనే వ్యక్తితో సత్య సంతోషిణికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్లు అయినా సంతానం కలగకపోవడంతో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ చేపట్టామని స్థానిక సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed