తిరిగి తెరుచుకున్న మేడారం ఆలయం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం నేడు తెరుచుకుంది. పలువురు భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో.. ఆలయాన్ని గత 20 రోజుల క్రితం మూసివేశారు. అనంతరం నేడు ఓపెన్ చేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. గత నెల 24 నుంచి 27 వరకు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర జరిగింది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలిచ్చారు. [&hellip;]</p>

తిరిగి తెరుచుకున్న మేడారం ఆలయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం నేడు తెరుచుకుంది. పలువురు భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో.. ఆలయాన్ని గత 20 రోజుల క్రితం మూసివేశారు. అనంతరం నేడు ఓపెన్ చేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

గత నెల 24 నుంచి 27 వరకు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర జరిగింది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలిచ్చారు. ఆ సమయంలో ఆలయ సిబ్బందితో పలువురు భక్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో.. 28వ తేదీ నుంచి ఆలయాన్ని మూసివేశారు.

Next Story