బిగ్ బ్రేకింగ్ : మేడారం జాతరకు డేట్స్ ఫిక్స్

by  |
బిగ్ బ్రేకింగ్ : మేడారం జాతరకు డేట్స్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే. జాతర ముగిసేనాటికి వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 2 కోట్లకు పైగా జనాభా హాజరవుతారు అని అంచనా.

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనులకు ఆరాధ్య దేవతలు, కష్టాలు తొలిగించే కలియుగ దైవాలుగా, వన దేవతలుగా సమ్మక్క-సారక్కలు పూజలందుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర పేరుగాంచినది. దీనికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు ఇష్టమైన బంగారం(బెల్లం)ను భక్తులు సమర్పించుకుంటారు. కాగా. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed