17 మంది క్వారంటైన్‌కు తరలింపు

by  |

దిశ, మహబూబ్‌నగర్: ఇటీవల ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 17 మందిని క్వారెంటైన్ కేంద్రానికి తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంత్రి స్వయంగా క్వారెంటైన్ సెంటర్‌ను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. వీరిని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి మసీదులో ప్రార్థనలో పాల్గొన్న మహబూబ్‌నగర్‌కు చెందిన 17 మందిని గుర్తించి వీలైనంత త్వరగా వారిని ఇక్కడికి తరలించాలని, అలాగే వారు వారి పరిసర ప్రాంతాలు, కుటుంబ సభ్యుల పరిస్థితులను కూడా ఒకసారి గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు, తదితరులు ఉన్నారు.

Tags : evacuate, 17 people, Quarantine, mahaboobnagar, Minister Srinivas Goud

Next Story

Most Viewed