కరీంనగర్‌లోనూ ఎంబీల గల్లంతు?

by  |
కరీంనగర్‌లోనూ ఎంబీల గల్లంతు?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇరిగేషన్ విభాగంలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోనూ మెజర్ మెంట్ బుక్స్ (ఎంబీ) గల్లంతు అయినట్టు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్, హుజురాబాద్ డివిజన్లకు సంబంధించిన దాదాపు 38 ఎంబీలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట ఎస్సారెస్పీ కెనాల్స్ డెవలప్‌మెంట్‌వర్క్స్‌తో పాటు మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన ఎంబీలు మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఏఏ పనులు ఏ స్టేజ్‌లో ఉన్నాయి? వాటికి చెల్లించేందుకు ఎంత డబ్బు డ్రా చేసేందుకు అనుమతి ఇచ్చారు? అని రూ.కోట్ల విలువ చేసే పనులకు సంబంధించిన వివరాలను ఎంబీల్లో ఇంజనీర్లు నమోదు చేశారు. అయితే ఈ ఎంబీలు గల్లంతు కావడం, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుండడం చూస్తే గుట్టు రట్టు కాకుండా అప్రమత్తమై, ఇందుకు బాధ్యులైన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


Next Story

Most Viewed