- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రవీందర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే తన పదవికి రాజీనామ చేస్తానని కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు సంచలన ప్రకటన చేశారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రవీందర్ సింగ్ గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత విజయం సాధించినట్టు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో రవీందర్ సింగ్ దిగజారుడు రాజకీయాలు చేశారని, టీఆర్ఎస్ ఓటర్లు ఇళ్లలో లేకున్నా వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.
వారి ఇండ్లకు వెళ్లి మొబైల్స్, డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారని సునీల్ రావు మండిపడ్డారు. నీతిమాలిన రాజకీయాలకు వారు పాల్పడినా.. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒక తాటిపై నిలిచి తమ సత్తా చాటారన్నారు. అధిష్టానం నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకే తమ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అండగా నిలిచారని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని తీరుతుందన్నారు. రవీందర్ సింగ్కు మద్దతు తెలిపిన బీజేపి నాయకులే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని విమర్శించారు.