ఆయన గెలిస్తే రాజీనామా చేస్తా.. మేయర్ సునీల్ రావు సంచలన ప్రకటన

by  |
ఆయన గెలిస్తే రాజీనామా చేస్తా.. మేయర్ సునీల్ రావు సంచలన ప్రకటన
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రవీందర్ సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే తన పదవికి రాజీనామ చేస్తానని కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు సంచలన ప్రకటన చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రవీందర్ సింగ్ గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత విజయం సాధించినట్టు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో రవీందర్ సింగ్ దిగజారుడు రాజకీయాలు చేశారని, టీఆర్ఎస్ ఓటర్లు ఇళ్లలో లేకున్నా వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.

వారి ఇండ్లకు వెళ్లి మొబైల్స్, డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారని సునీల్ రావు మండిపడ్డారు. నీతిమాలిన రాజకీయాలకు వారు పాల్పడినా.. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒక తాటిపై నిలిచి తమ సత్తా చాటారన్నారు. అధిష్టానం నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకే తమ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అండగా నిలిచారని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని తీరుతుందన్నారు. రవీందర్ సింగ్‌కు మద్దతు తెలిపిన బీజేపి నాయకులే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని విమర్శించారు.

Next Story

Most Viewed