‘బండి సంజయ్’వి ఎలక్షన్ స్టంట్స్! : మేయర్

by  |
‘బండి సంజయ్’వి ఎలక్షన్ స్టంట్స్! : మేయర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఎన్నికల వేళ ఇలాంటి డ్రామాలు వేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం అలవాటు అని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గపు ఆలోచనతో బండి రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. పోలీసులకు విధి నిర్వాహణలో భాగంగా ఎక్కడైనా సోదాలు చేసే అధికారం ఉందన్న విషయం సంజయ్‌కు తెలియకపోవడం సిగ్గు చేటన్నారు.

ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. దుబ్బాకలో ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంగా పనిచేస్తోందని.. ఓడి పోతామన్న భయంతోనే బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని సునీల్ రావు ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ రఘునందన్ రావుకు ఇప్పటివరకు డిపాజిట్ కూడ దక్క లేదని ఇప్పుడు కూడా అదే దుస్థితి వస్తుందని మేయర్ చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed