మనీ సర్క్యులేషన్ పేరుతో భారీ మోసం

by  |
మనీ సర్క్యులేషన్ పేరుతో భారీ మోసం
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ ఫోన్లో ఓటీపీ చెప్తే చాలు మీకు బహుమతులు అంటూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. అమాయకులనే ఆసరాగా చేసుకుని వీరు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసిన మనీ సర్క్యులేషన్ కంపెనీ గుట్టు రట్టయింది. సుమారు 1500 కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన ఇండస్ వివా కంపెనీకి చెందిన 24 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లో 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు.


Next Story

Most Viewed