చర్ల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

by  |
చర్ల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దండకారణ్యంలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో తండావాసులు, చర్ల ప్రాంత ప్రజలు ఉలిక్కపడ్డారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్‌ ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.



Next Story