ఇకపై మెట్రోలో స్మార్ట్ కార్డు.. టోకెన్ సిస్టమ్ రద్దు!

by  |
ఇకపై మెట్రోలో స్మార్ట్ కార్డు.. టోకెన్ సిస్టమ్ రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అన్‌లాక్ 4.0 ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కేంద్ర హోంశాఖ శనివారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో సర్వీసులు నడుస్తాయని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

తాజాగా, మెట్రో సర్వీసులకు సంబంధించిన మార్గదర్శకాలు ఆదివారం వెలువడ్డాయి. మెట్రోలో ప్రయాణం చేయాలనుకునే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని, స్మార్ట్ కార్డులు ఉపయోగించాలని సూచించింది. ఇదివరకు ఉన్న టోకెన్ల విధానాన్ని రద్దు చేస్తూనే.. పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని కేంద్రం సూచించింది.



Next Story