ధరణిలో మార్ట్ గేజ్ సేవలు

by  |
ధరణిలో మార్ట్ గేజ్ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ద్వారా మార్ట్ గేజ్(తనఖా) పెట్టే సేవలను మంగళవారం ప్రారంభించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి వీలుగా వ్యవసాయ భూములను తనఖా పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా టెర్మ్ లోన్లకు ఇది తప్పనిసరి. దాంతో మార్ట్ గేజ్ సేవలను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ధరణి ఆధారంగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సక్సెషన్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. తాజాగా మార్ట్ గేజ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదేక్రమంలో ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టంబద్ధం కాదని మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించగా బుధవారం విచారణ చేపడుతామని న్యాయస్థానం వెల్లడించింది.


Next Story