పెళ్లి మండపంలో పోలీసులు.. భోజనాల్లేవు

by  |
పెళ్లి మండపంలో పోలీసులు.. భోజనాల్లేవు
X

గుంటూరు జిల్లాను కరోనా భయం పట్టిపీడిస్తోంది. గుంటూరులోని ఐడీ ఆసుపత్రిలో ప్రకాశం జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో పోలీసులు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నరసరావు పేటలోని జమీందార్ ఫంక్షన్ హాల్‌లో వివాహ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. వివాహ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి పెళ్లి తంతు పూర్తి కావడంతో.. గుంపులుగా ప్రజలు ఉండకూడదని… తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతిధులను ఆదేశించారు. దీంతో కొంత మంది భోజనాలు చేయకుండానే వెనుదిరగారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేడుకను అడ్డుకున్నట్టు వారు వెల్లడించారు.9


Next Story

Most Viewed