- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నా భార్యతో హెడ్ కానిస్టేబుల్ ఎఫైర్ పెట్టుకుని చంపేశాడు.. పీఎస్లో భర్త ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చోటుచేసుకున్న ఆత్మహత్యలు, హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని తేలుతున్నాయి. కర్ణాటకలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ తో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. దీంతో అతనిపై భర్త ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని శిడ్లఘట్ట మారమ్మ దేవాలయం సర్కిల్ లో నివాసముండే రాజేశ్వరి(35)-వెంకటేశ్ భార్యాభర్తలు. వీరిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు. కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, అనంత్ కుమార్ అనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తో రాజేశ్వరి వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత నాలుగేళ్ల నుంచి వీరి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే, ఈనెల 21న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే, రాజేశ్వరి ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అనంత్ కుమారే తన భార్యను హత్య చేశాడని పోలీసులకు రాజేశ్వరి భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అనంత్ కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించి రాజేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.