‘ఐ లవ్ యూ బావా’.. నోట్‌ రాసి వివాహిత సూసైడ్..!

by  |
‘ఐ లవ్ యూ బావా’.. నోట్‌ రాసి వివాహిత సూసైడ్..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లోవారికి ఇష్టం లేకున్నా.. ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అంతలో ఎమైందో తెలీదు కానీ, నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కొల్చారం ఉప సర్పంచి నింగొల్ల లక్ష్మి, చెన్నయ్యల దంపతులకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. నవనీత(19) ఇంటర్‌ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ఆశన్నగారి లక్ష్మి, మల్లేశంలు వీరికి దూరపు బంధువులు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు ప్రశాంత్..

అతను నవనీతకు వరుసకు బావ అవుతాడు. దీంతో వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వారికి ఇష్టం లేకపోయినా నవనీత, ప్రశాంత్‌లు ఎలాగోలా పెద్దవారిని ఒప్పించి గత ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం సూసైడ్‌ నోట్‌ రాసి నవనీత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నవనీత, ప్రశాంత్‌లు పెళ్లైనా రెండునెలల పాటు అన్యోన్యంగా ఉన్నారని, అత్తమామలు మల్లేశం, లక్ష్మి కట్నం తీసుకురమ్మని వేధించడంతో మానసిక వేదనకు గురై తర కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

నాకు ఓడిపోవాలని లేదు బావా..

నవనీత చనిపోయే ముందు ‘ఐ లవ్‌ యూ బావా’.. అంటూ రాసిన సూసైడ్‌ లెటర్‌ ఘటనా స్థలిలో దొరికినట్లు ఎస్‌ఐ తెలిపారు. అందులో ఎముందంటే.. హాయ్‌ బావా నీకు నేను అంత ఇష్టం లేనట్టుగా ఉంది. నాకంటే నీకు చాలా మంది ముఖ్యమైన వారున్నారు.. ‘నాకు ఓడిపోవాలని లేదు బావా’.. ఐనా ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా నా చావు కబురు వింటావు.. బై బావా సంతోషంగా ఉండు..’ అని ఆ నోట్‌లో పేర్కొంది.

Next Story

Most Viewed