- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కొడిమ్యాల : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు మరో వివాహిత బలైంది. ఈ ఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం సండ్రాళ్ల పల్లి గ్రామంలో వెలుగుచూసింది. కొడిమ్యాల ఎస్ఐ శివాని రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లతను(33) సండ్రాళ్లపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లయిన కొద్ది రోజులు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే, అత్తింటివారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదనపు కట్నం తేవాలని వివాహితను వేధింపులకు గురిచేశారు.
చాలా రోజులు భరించిన లత చివరకు చేసేదేమీ లేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివాని రెడ్డి తెలిపింది.