కష్టాల ‘కడలి’ దాటలేక.. కొడుకుతో సహా రైల్లో నుంచి దూకిన వివాహిత!

by  |
train
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని శ్రీ కాళహస్తి అక్కుర్తిలో దారుణం చోటుచేసుకుంది. రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కిన వివాహిత తన రెండేళ్ల కొడుకుతో పాటు రన్నింగ్ రైలు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తిరుపతి కొర్లగుంటకు చెందిన వాలంటీర్ చందనగా గుర్తించారు. బాధితురాలు చందన నిన్న భర్తతో గొడవపడి బాబుతో పాటుగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్థాపం చెందిన ఆమె అక్కుర్తి సమీపంలో రైల్లో నుంచి కొడుకుతో సహా కిందకు దూకినట్టు సమాచారం. చందన, ఆమె కొడుకు డెడ్ బాడీని గుర్తించిన రైల్వే పోలీసులు పోస్టు మార్టం కోసం పంపించారు. రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏపీ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed