- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,మహేశ్వరం: మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకొంది. ఘట్టుపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఆసియా బేగం(35), భర్త గౌస్ తో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త దినసరి కూలీ కావడంతో రోజులాగే శుక్రవారం కూడా ఆమనగల్ పనికి వెళ్లాడు. పిల్లలు స్కూల్ కి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఆసియా బేగం కుమారులు ఇఫ్రాన్, అప్రోస్ స్కూల్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి నేలపై పడిఉంది. దీంతో భయపడిన చిన్నారులు పక్కింట్లో ఉంటున్న వారి పిన్నికి సమాచారం అందించగా.. వారు వచ్చిచూసేసరికి ఆసియా బేగం మృతి చెంది ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఆసియా గొంతుకు చున్నీలాంటిది చుట్టి ఉండడం, తలకు బలమైన గాయం తగిలి ఉండడం గమనించిన పోలీసులు ఆమెది హత్యా అనే కోణంలో విచారిస్తున్నారు. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.