ఇంట్లో అలా కనబడిన భార్య.. ఆ తర్వాత మంచంపై వైపు చూసి షాకైన భర్త

by  |
vivahitha1
X

దిశ, శంషాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను హత్యచేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం మున్నెపు సాయికుమార్ కు మున్నెపు స్వాతికి గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తన్వీక్ (5), శ్రేయ(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోర్ట్వీ కాలనీలోని శ్రీనివాస అపార్ట్మెంట్లోని 304 ప్లాట్ లో ఉండేవారు. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. భర్త సాయికుమార్ నిత్యం భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం భర్త డ్యూటీకి వెళ్లి వచ్చే వరకు ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉందని, డోర్ కొట్టిన ఎంత సేపటికీ తీయకపోవడంతో డోర్ బద్దలుకొట్టి చూసే సరికి ఇంట్లో భార్య స్వాతి (32) చీరతో ప్యాన్ కు ఉరివేసుకొని, మంచంపై ఇద్దరు పిల్లలు తన్వీక్ (5) శ్రేయ (3) కూడా మృతిచెంది ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మంచంపై ఉన్న సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed