- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆందోల్: భర్త వేధింపులను భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్సై వెంకట రాజా గౌడ్ వివరాల ప్రకారం…జోగిపేటకు చెందిన బత్తిని భాను(21)కు డాకుర్ గ్రామానికి చెందిన బత్తిని దేవయ్యతో ఏడాదిన్నర క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. దేవయ్య తన మొదటి భార్య లావణ్యకు పిల్లలు కాకపోవడంతో భానును రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలపాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. 5 నెలల క్రితం మగ బిడ్డకు భాను జన్మనిచ్చింది. తర్వాత క్రమంలో ఆమెను భర్త మానసిక వేధింపులకు గురిచేశారు.
వేధింపులు భరించలేక ఈనెల 16న ఇంట్లో చున్నీతో భాను ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తన మనుమరాలును భర్త దేవయ్య, మొదటి భార్య లావణ్యలు వేధింపులకు గురి చేయడం తోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు బత్తిని జోగమ్మ ఫిర్యాదు చేసింది. వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకట రాజా గౌడ్ తెలిపారు.