- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, టేక్మాల్: కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో సహా వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దాదాయిపల్లి గ్రామానికి చెందిన కోటంగారి రజిత, రాజుకు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, భర్త రాజుకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని తెలియడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి తన ఇద్దరు చిన్నారులైన రక్షిత, జశ్వంత్ లతో గచ్చుకుంటలో దూకినట్లు రజిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు కుంట వద్దకు వెళ్లి చూడగా ఇద్దరు చిన్నారులు నీటిలో శవమై తేలారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. చెరువు వద్ద రజిత చెప్పులు ఉండడంతో ఆమె కూడా దూకిందనే అనుమానంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. గతంలో కూడా భార్యాభర్తలు గొడవలు పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయని, ఇది ఆత్మహత్య కాదని భర్తే హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- Tags
- Married suicide