- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావు నగర్ అభినవ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యునిగా చేరిన వారికి భీమ సౌకర్యం కల్పించేందుకు పార్టీ అధిష్టానం ఆలోచిస్తూందని అన్నారు.
అది కూడా తొందర్లో అమలులోకి వస్తుందని దాని వలన ప్రతి కార్యకర్తకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజలలో నమ్మకము సన్నగిల్లిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమములో డివిజన్ అధ్యక్షులు గుంటి సత్యనారాయణ, అంబాలా ఈశ్వర్ బాబు, రాజీవ్ దేశ్ పాండే, చంద్రపాల్ రెడ్డి, పార్శి మహేష్, యం.బాలకృష్ణ, వి.సందీప్ ఆనంద్, బొజ్జ నర్సింగ్ రావు, యం. జగదీష్, బి. రాములు, వేద్ ప్రకాష్ యాదవ్, కిరీటా, మల్లికార్జున్, పిట్ల శ్రీనివాస్, యం. గోపి, జి. శ్యామ్, మురారి, దశరథ్, టి.రామకృష్ణ, యు. రాకేష్, సి.యచ్.సంతోష్, తదితరులు పాల్గొన్నారు.