మార్క్​ మామ దుకాణం 7 గంటలు బంద్.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?

by  |
మార్క్​ మామ దుకాణం 7 గంటలు బంద్.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?
X

దిశ,డైనమిక్ బ్యూరో : సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు అత్యంత వినియోగ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ లు నిలిచిపోయాయి. దీంతో సామాజిక ప్రపంచం అతలాకుతలం అయింది. ఏమైందో తెలియక వినియోగదారులు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది యూజర్లు ట్విట్టర్ వేదికగా వారి కోపాన్ని చూపెట్టారు. ఈక్రమంలో #deleteFacbook అనే హాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దీంతో మార్క్ జుకర్ బర్గ్‌కి చుక్కలు కనిపించాయనే చెప్పాలి. ఫేస్​బుక్ చరిత్రలో ఇంత సేపు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.

మానవ జీవనంలో ఒక్కటిగా కలిసిపొయిన సామాజిక మాధ్యమాలు నిలిచిపోవడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పాలి. అత్యవసర సమాచారం అందించేందుకు తిరిగి పాత విధానాలనే ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ ఏడు గంటలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు నిలిచిపోవడం వల్ల సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా ఎక్స్ఛేంజీలో ఫేస్​బుక్ షేర్లు దాదాపు 5 శాతం పతనమయ్యాయి. దీనితో ఆయన గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్ల నష్టపోయినట్లు తెలిసింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మార్క్ జుకర్​బర్గ్​ 5వ స్థానానికి పడిపోయారు.


Next Story

Most Viewed